హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్ల గుర్తింపులో పారదర్శకత తప్పనిసరి: డీఆర్వో

కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని డీఆర్వో కె. మల్లికార్జునుడు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 16 నుంచి 20 వరకు ఇంటింటి సర్వే, సెప్టెంబరు 5న తుది జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు. ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయాలని సూచించారు.