హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ కార్మికుల ర్యాలీ..!

కడప: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఉదయం 11 గంటలకు కోటిరెడ్డి సర్కిల్‌ నుంచి కడప కార్పొరేషన్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని కవర్‌ చేయాలని నిర్వాహకులు కోరారు.