హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయ షెఫ్‌కు అరుదైన గౌరవం

మోతీహార్‌కు(బీహార్‌) చెందిన ప్రముఖ షెఫ్ నందకిశోర్ యాదవ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం దక్కింది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరోలో బ్రిటన్ రాజు ఛార్లెస్-3, రాణి కెమిలా దంపతులు నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'రాయల్ గార్డెన్ పార్టీ'కి ఆయన హాజరయ్యారు. 1999లో రాజస్థాన్‌లో వంటల ప్రయాణం ప్రారంభించిన ఆయన, ఆ వేడుకకు హాజరుకావడం తనకెంతో గర్వకారణమన్నారు.