AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి స్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, NLR, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వార్తలు
అల్పపీడనం.. పలు జిల్లాల్లో వర్షాలు


