హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌పై అమిత్ షా మండిపాటు

కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశ ప్రజలను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. వందేమాతరం గేయాన్ని కాంగ్రెస్ అవమానించిన వీడియోను 140 కోట్ల మంది భారతీయులు చూశారని చెప్పారు. వందేమాతరాన్ని అవమానించినందుకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.