TG: యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డును రద్దు చేయాలని కోరుతూ ఆలయ వంశపారపర్య ధర్మకర్త నరసింహమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. తనకు చట్టబద్ధంగా దక్కాల్సిన ఛైర్మన్ పదవిని నిరాకరించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
భక్తి
యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుపై హైకోర్టులో పిటిషన్


