హైదరాబాద్: 28°C
వార్తలు

గవర్నర్ పర్యటన నిలిపివేత

MDK: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఈనెల 6న చేపట్టాల్సిన మెదక్ పర్యటన రద్దయినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పర్యటనలో భాగమైన ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ దర్శనం, మెదక్ ఖిల్లా, చర్చిల సందర్శనలతో పాటు రాందాస్ చౌరస్తాలో నిర్వహించాల్సిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమాలు అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.