2027 వన్డే ప్రపంచకప్పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగాటోర్నీలో భువనేశ్వర్ కుమార్ను ఆడించాలన్నాడు. సౌతాఫ్రికాలో అతడి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ టోర్నమెంట్లో అత్యంత కీలకమని విశ్లేషించాడు. ప్రధాన స్పిన్నర్ బాధ్యతలను కుల్దీప్ వ్యవహరిస్తాడని తెలిపాడు.
క్రీడలు
WCలో భువీ అనుభవం అవసరం: అశ్విన్


