హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పారా పురుషుల 100 మీటర్ల టీ47 పరుగులో దిలీప్‌ మహాదు గావిత్‌ స్వర్ణం గెలుచుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్‌ మహ్మద్‌ బసిల్‌ రజతం కైవసం చేసుకున్నాడు. కాగా, ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, షాట్‌పుట్‌‌లో ధన్‌ఖడ్‌ స్వర్ణాలు గెలిచారు.