హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇన్సూరెన్స్ రంగంలోకి పతంజలి సంస్థ

బాబా రామ్‌దేవ్‌నకు చెందిన పతంజలి సంస్థ.. బీమా రంగంలోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం FMCG, ఆయుర్వేద ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తోంది. మాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో మెజారిటీ వాటాను పతంజలి కొనుగోలు చేయనుంది. ఈ ప్రతిపాదనకు బీమా నియంత్రణ మండలి IRDAI గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీని ప్రకారం పతంజలి సంస్థకు మాగ్మా నుంచి 73.56% వాటా దక్కనుంది.