తమిళనాడు సర్కారు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా.. విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ఆలోచన చేస్తోంది. స్కూళ్లలో పౌష్టికాహారాన్ని మెరుగపరచడంతో పాటు, విద్యార్థులను స్కూళ్ల వైపు మరింత ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసింది. దీన్ని CM విజయ్ పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వార్తలు
మధ్యాహ్నం భోజనంలో బిర్యానీ!


