హైదరాబాద్: 28°C
క్రీడలు

చైనా ఓపెన్‌లో పీవీ సింధు బోణీ

జపాన్ ఓపెన్ గెలిచిన పీవీ సింధు చైనా ఓపెన్‌లోనూ బోణీ కొట్టి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన ఉన్నతి హుడాను 21-14, 9-21, 21-10తో ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ జపాన్‌కు చెందిన యుశి టనాకాను ఓడించాడు. ఆయుష్ శెట్టి ప్రపంచ 11వ ర్యాంకర్ అల్వి ఫర్హాన్‌కు షాకిచ్చి విజయం సాధించాడు.