MLG: వాజేడు మండల ప్రజాసమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో ప్రజాపోరాట సమితి అధ్యక్షుడు ముత్తేబోయిన మహేందర్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. చీకుపల్లి ఇసుకవాగుపై వంతెన నిర్మాణం,పేరూరులో 108 అంబులెన్స్, ఆశ్రమపాఠశాలల మరమ్మతులు, పాఠశాలలకు తాగునీటి వసతి, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, కొరకల్ను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలన్నారు.
వార్తలు
'వాజేడు సమస్యలు పరిష్కరించండి'


