ASR: జీకేవీధి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ కుమారి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గిరిజనుల భూహక్కుల పరిరక్షణ కోసం 1/70చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, గ్రామసభ అనుమతి లేకుండా బాక్సైట్ సర్వేలు, ఖనిజ నమూనాల సేకరణ నిలిపివేయాలని సభ్యులు అధికారిక తీర్మానం చేశారు. అనంతరం తీర్మాన పత్రాన్ని ఎంపీపీ కుమారి, ఎంపీడీవో రమణబాబుకు అందజేశారు.
వార్తలు
బాక్సైట్ సర్వేలు నిలిపివేయాలని తీర్మానం
Advertisement
Advertisement
Advertisement


