హైదరాబాద్: 28°C
వార్తలు

చిన్నారుల కోసం టీటీడీ 'అక్షర గోవిందం'

Advertisement

AP: టీటీడీ ఇవాళ చిన్నారుల కోసం 'అక్షర గోవిందం-అన్నప్రాశన' కార్యక్రమాలను ప్రారంభించనుంది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో ఇకపై మంగళవారం మినహా రెండు బ్యాచ్‌లలో, ఒక్కో బ్యాచ్‌కు 25 మంది చొప్పున అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలను నిర్వహించనుంది. వీరికి ఉచితంగా అక్షర గోవిందం కిట్ ఇస్తామని టీటీడీ తెలిపింది. దీని కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంది.

Advertisement

Advertisement