హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన MPDO

Advertisement

కృష్ణా: నందివాడ మండలం అరిపిరాల మండల పరిషత్ ఉన్నత పాఠశాలను MPDO మల్లేశ్వరి బుధవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజన మెనూ అందుతుందా లేదా అనే విషయాన్ని విద్యార్థులను ఆమె అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంట విధానాన్ని పరిశీలించిన ఆమె, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Advertisement

Advertisement