హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాల బీభత్సం.. నది ఉధృతికి కూలిన రైల్వే బ్రిడ్జ్

Advertisement

అసోంలోని ధేమాజీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద తాకిడికి సిమెన్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, దానిపై ఉన్న రైల్వే వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. బ్రిడ్జ్ దెబ్బతినడంతో సదరు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

Advertisement