KDP: సిద్దవటం మండలంలోని మాధవరం గ్రామంలో వెలసిన శ్రీ మంగళగౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జింకా సాంబయ్య స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పలు అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
వార్తలు
అమరలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
Advertisement
Advertisement
Advertisement


