హైదరాబాద్: 28°C
వార్తలు

ఫీజుల భారం తగ్గించాలని MEOకు వినతి

Advertisement

WGL: నర్సంపేట పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నారని, తరగతుల వారీగా ఫీజులను క్రమబద్ధీకరించాలని కోరుతూ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో MEO సారయ్యకు వినతి పత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు MEOను కోరారు.

Advertisement

Advertisement