MDK: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విత్తన మేళా రామాయంపేటలో MEO ప్రవీణ్ ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 30 వరకు జరిగే ఈ మేళాలో రైతు ముంగిట్లోకి నాణ్యమైన విత్తనాలు తెచ్చామన్నారు. సన్న రకం వడ్లు, పప్పు దినుసులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, డీఏపీలు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
రామాయంపేటలో ఘనంగా విత్తన మేళా
Advertisement
Advertisement
Advertisement


