హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత వైద్య శిబిరం.. 500 మందికి ఆరోగ్య పరీక్షలు

Advertisement

KNR: శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ వాజిదా యోద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో సుమారు 500 మంది గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. రోగుల సమస్యలను పరిశీలించిన వైద్యులు అవసరమైన సలహాలు, చికిత్స సూచనలు అందించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించిన వైద్య బృందాన్ని స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement