హైదరాబాద్: 28°C
వార్తలు

యోగాంధ్ర పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

Advertisement

సత్యసాయి: విజయవాడలో జరిగిన యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా విద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ పోటీల్లో జిల్లా తరపున 24 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో టాప్ ప్లేస్‌లు సాధించిన విజేతలకు మంత్రి సత్య కుమార్ యాదవ్ అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థులు జిల్లా కీర్తిని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు.

Advertisement

Advertisement