హైదరాబాద్: 28°C
వార్తలు

కుళ్లాయి స్వామివారిని దర్శించుకున్న బల్లా పల్లవి

Advertisement

ATP: నార్పల మండలం గూగూడులోని ప్రసిద్ధ కుళ్లాయి స్వామివారిని అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గూగూడు కుళ్లాయి స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

Advertisement