KDP: ప్రథమ చికిత్స కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డాక్టర్ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన లింగాలలోని ప్రథమ చికిత్స కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనుమతి లేకుండా సర్జరీలు, డెలివరీలు, అబార్షన్లు వంటి ప్రమాదకర చికిత్సలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు.
వార్తలు
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
Advertisement
Advertisement
Advertisement


