హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సందర్శించిన డీఈవో

Advertisement

కృష్ణా: గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఈవో సుబ్బారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, నోటు పుస్తకాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం భోజన పథకం అమలును పరిశీలించి, విద్యార్థులకు అందించే భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. భోజనం నాణ్యత పరిశుభ్రతను పరిశీలించి తగు సూచనలు అందించారు. 

Advertisement

Advertisement