హైదరాబాద్: 28°C
వార్తలు

జాజులబంధలో ఉపాధ్యాయుడిని నియమించాలని నిరసన

Advertisement

ASR: కొయ్యూరు మండలంలోని మూలపేట పంచాయతీ మారుమూల పీవీటీజీ గ్రామమైన జాజులబంధ గ్రామానికి ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు ఇవాళ విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. పాఠశాలలు ప్రారంభించి, వారం రోజులు గడుస్తున్నా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు.

Advertisement

Advertisement