కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉందన్న వాదనను ఆయన ఖండించారు. తాము ఎవరికీ బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ఆయన కారణంగా దేశంలోని విద్యార్థులు ఎంతో ప్రభావితమయ్యారని, అందుకు ఆయన నైతిక బాధ్యత వహించాలని చెప్పారు.
వార్తలు
మేం ఎవరికీ బీ-టీమ్ కాదు: సీజేపీ
Advertisement
Advertisement
Advertisement


