బాపట్ల ఆంజనేయస్వామి గుడి పక్కనున్న స్థలం పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయింది. ఆ ప్రాంతం మినీ డంపింగ్ యార్డ్లా తయారైంది. పారిశుద్ధ్య సిబ్బంది అటుగా వెళ్తున్నా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ చెత్తతో తీవ్ర దుర్వాసన వస్తోంది. రోగాల బారిన పడతామని భక్తులు, స్థానికులు భయపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
గుడి పక్కన చెత్త గుట్టలు
Advertisement
Advertisement
Advertisement


