TG: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ నేపథ్యంలో RTA అధికారులు స్కూల్ బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 28 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేశామని, 12 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల భద్రతకు విద్యాసంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వార్తలు
బడి బస్సుల భద్రతపై స్పెషల్ ఫోకస్
Advertisement
Advertisement
Advertisement


