హైదరాబాద్: 28°C
వార్తలు

మూడవ అంతస్తు పైనుంచి పడి తీవ్ర గాయాలు

Advertisement

SRD: కంది మండలం కాసింపూర్‌లో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన చరణ్ సింగ్ అందరితో కలిసి మద్యం సేవించి, మూడో అంతస్తుపై నిద్రపోయాడు. నిద్రలోనే అతడు ఎప్పుడు కిందపడ్డాడో ఎవరికీ తెలియలేదు. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా, సిబ్బంది చిరంజీవి, రఘురాం ప్రథమ చికిత్స అందించి అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Advertisement