హైదరాబాద్: 28°C
వార్తలు

కలికిరిలో బొలేరో బీభత్సం.. 10 గొర్రెల మృతి

Advertisement

అన్నమయ్య జిల్లా కలికిరి మండలం యల్లంపల్లి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందాయి. సోమల- కలకడ రహదారిపై రోడ్డు దాటుతున్న గొర్రెల మందను వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు అతడిని కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement