హైదరాబాద్: 28°C
వార్తలు

హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ ఆర్థిక సాయం

Advertisement

ATP: అనంతపురం ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. శ్రీనివాసులు కాలేయ వ్యాధితో చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల జిల్లా ఎస్పీ పి.జగదీష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ పరిస్థితిని గమనించిన ఎస్పీ, అంత్యక్రియల ఖర్చుల కోసం తక్షణమే రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

Advertisement

Advertisement