హైదరాబాద్: 28°C
వార్తలు

​మున్సిపల్ కమిషనర్ పారిశుద్ధ్య తనిఖీలు

Advertisement

బాపట్ల: పట్టణంలో పలు వార్డులు, జీబీసీ రోడ్డులో మున్సిపల్ కమిషనర్ ఎం.హాసిని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్లపై చెత్త పేరుకుపోకుండా రోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణకు సూచించారు. అనంతరం 23వ వార్డు వివేకానంద కాలనీ పార్కును పరిశీలించారు. పార్కును మరింత అందంగా తీర్చిదిద్దాలని డీఈఈ కృష్ణారెడ్డిని కమిషనర్ ఆదేశించారు.

Advertisement

Advertisement