మణిపూర్లో హింస ఆగడం లేదు. తాజాగా కాంజొంగ్ జిల్లా కుల్తుకుకి గ్రామంపై కొంత మంది సాయుధులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గత నెలలో సాయుధులు అపహరించుకుపోయిన వారిలో ఆరుగురు మృతదేహాలు లభ్యకావడంతో.. దీనికి ప్రతీకారంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
ఆగని హింస.. ఇద్దరు మృతి
Advertisement
Advertisement
Advertisement


