KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డుపై జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, నాణ్యతలో రాజీ పడితే ఉపేక్షించబోమని అధికారులను హెచ్చరించారు. అలాగే పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్&బీ ఏఈ వెంకటరమణకు ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
సీసీ రోడ్డు పనుల పరిశీలన
Advertisement
Advertisement
Advertisement


