హైదరాబాద్: 28°C
వార్తలు

నౌకలపై దాడులు.. తీవ్రంగా ఖండించిన భారత్‌

Advertisement

ఒమన్‌ తీరంలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేయటాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలపై దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని వెల్లడించింది. మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరోవైపు నౌకలపై దాడులను ఐరాసలో భారత్ ఖండిస్తూ.. పలువురు భారతీయ నావికులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement

Advertisement