GNTR: మంగళగిరి యర్రబాలెంలో వర్షానికి కాలువలు పొంగి రోడ్లపైకి నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు జేసీబీతో కచ్చా కాలువ పూడిక తీయించి నీటిని మళ్లించారు. కాలువలపై ఆక్రమణల వల్లే ఈ సమస్య వస్తోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలి, కల్వర్టులు నిర్మించి మురుగు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పేర్కొన్నారు.
వార్తలు
పొంగిపొర్లిన కాలువలు.. తక్షణ చర్యలు సురూ.!
Advertisement
Advertisement
Advertisement


