MNCL: జన్నారం మండలంలోని గాంధీ నగర్లో వడదెబ్బ తగిలి ఒక వృద్ధురాలు మృతి చెందింది. ఆ కాలనికి చెందిన సురనేని రాజవ్వ (80) రెండు రోజుల క్రితం వడ దెబ్బకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజవ్వ మృతి చెందారు. 20 రోజులలో వడదెబ్బతో జన్నారంలో 11 మంది చనిపోయారని స్థానికులు తెలిపారు.
వార్తలు
వడదెబ్బతో వృద్ధురాలు మృతి
Advertisement
Advertisement
Advertisement


