భారత్ ఏ విషయంలోనూ ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇకపై నౌకలు, కంటైనర్లతో పాటు త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ విమానాలు రాబోతున్నాయని వెల్లడించారు. మన యువత ఏఐ, డీప్టెక్ సాంకేతికతను అందిపుచ్చుకుంటోందని.. సౌర, పవన, న్యూక్లియర్ ఎనర్జీ రంగాల్లో దేశం ముందుకు సాగుతూ, డిజిటల్ పేమెంట్స్లో ప్రపంచాన్ని లీడ్ చేస్తోందని చెప్పారు.
వార్తలు
త్వరలోనే 'మేడిన్ ఇండియా' విమానాలు: మోదీ


