ప్రకాశం: మద్దిపాడు సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బుధవారం ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి మద్దిపాడు మండలానికి చెందిన సీతారాంగా పోలీసులు గుర్తించారు. జరిగిన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు


