ELR: చింతలపూడి మండల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ని మంగళవారం రాత్రి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఊటసముద్రం బీటీ రోడ్డు, ఖండ్రికగూడెం బీటీ రోడ్డు, మద్ది మత్తెనగూడెం సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
వార్తలు
'రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి'


