హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు మదనపల్లెకు మంత్రి రవీంద్ర రాక..!

అన్నమయ్య: రాష్ట్ర ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈనెల 11న మదనపల్లె రానున్నారు. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 10 గంటలకు మదనపల్లెకు వచ్చి 10.30 వరకు క్షేత్రస్థాయిలో క్వారీలను పరిశీలిస్తారు. తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహిస్తారన్నారు.