హైదరాబాద్: 28°C
వార్తలు

'తెలుగు సమాజంపై రామోజీ సేవలు చిరస్మరణీయం'

KRNL: తెలుగు మీడియా, సినీ, వ్యాపార రంగాల్లో తనదైన ముద్ర వేసిన మీడియా దిగ్గజం రామోజీ రావు రెండో వర్ధంతి సందర్భంగా సోమవారం నియోజకవర్గ ప్రజల తరపున MLA బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. దూరదృష్టి, కృషి, సంకల్పంతో శిఖరాగ్రాలను అధిరోహించిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగు సమాజంపై ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.