ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా గందరగోళం నెలకొంది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు వాటంతటవే కదులుతూ వెళ్లి నిలిపి ఉంచిన మూడు ఎయిరిండియా విమానాలను ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ విమానాలకు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతున్నాయి.
వార్తలు
విమానాలను ఢీకొన్న సపోర్టింగ్ పరికరాలు


