TMC MLA మదన్ మిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. కమార్హాటీ నియోజకవర్గంలో అరియాదయా ప్రాంతంలో పర్యటనకు వెళ్లగా.. తమ సమస్యలను చెప్పేందుకు ప్రజలు గుమిగూడారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోడిగుడ్లు విసిరారు. అంతేకాకుండా MLA కాన్వాయ్పై కూడా దాడి చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ముందస్తు వ్యూహంలో భాగంగానే BJP నేతలు తమపై దాడి చేశారని ఆరోపించారు.
వార్తలు
టీఎంసీ ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి!


