ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో రేపు ఇండియా కూటమి పార్టీల సమావేశం జరగనుంది. దేశంలోని రాజకీయ పరిస్థితులు, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కూటమిని మరింత బలోపేతం చేయడంపై అన్ని పార్టీల నేతలు చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో మొత్తం 23 పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, మాజీ సీఎంలు అఖిలేష్, మమతాతో పాటు జాతీయ నాయకులు పాల్గొననున్నారు.
వార్తలు
రేపు 23 పార్టీలతో ఇండి కూటమి మీటింగ్


