హైదరాబాద్: 28°C
వార్తలు

లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు లండన్‌లో అవమానం జరిగింది. బిర్క్‌బెక్ యూనివర్సిటీలో ఆయన ప్రసంగ సమయంలో కొందరు భారతీయులు గందరగోళం సృష్టించారు. ఇటీవల సుప్రీంకోర్టులో సీజేఐ చేసిన 'కాక్రోచ్' వ్యాఖ్యలపై ప్రశ్నలు లేవనెత్తడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. దీంతో సీజేఐ సూర్యకాంత్ షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.