MLG: ములుగు 132 కేవీ సబ్స్టేషన్లో అత్యవసర మరమ్మత్తుల నేపథ్యంలో ఇవాళ ఉదయం 6:30 గంటల నుంచి 10గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ పులుసం నాగేశ్వరరావు తెలిపారు. ములుగు, ఖాసీందేవిపేట, పత్తిపల్లి, అబ్బాపూర్, మల్లంపల్లి, రామచంద్రాపురం, పందికుంట, కోడిశాలకుంట, లక్ష్మీదేవిపేట, నర్సాపూర్, వెంకటాపూర్ సబ్స్టేషన్ల పరిధి ప్రాంతాలలో అంతరాయం కలుగుతుందన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


