హైదరాబాద్: 28°C
వార్తలు

'రాయలసీమ అభివృద్ధికి కడప కేంద్రబిందువుగా మారాలి'

కడప జిల్లా చారిత్రక, ఆధ్యాత్మిక, ఖనిజ సంపదతో రాయలసీమ అభివృద్ధికి కీలకంగా మారే అవకాశముందని శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. “రైజింగ్ రాయలసీమ” సదస్సులో మాట్లాడుతూ పర్యాటకం, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెరిగితే జిల్లాలో ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.