హైదరాబాద్: 28°C
వార్తలు

50 వేల నాణేలతో మెరిసిపోతున్న వినాయకుడు

ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బజ్‌రంగ్ చౌక్ వద్ద 50 వేల నాణేలతో గణేశుడి ప్రతిమను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రూ.1 నుంచి రూ.10 వరకు వివిధ నాణేలు వినియోగించి ఈ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దారు. బంగారు, వెండి రంగుల్లో మెరిసిపోతున్న వినాయకుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.